సాహో, ఎవరు మూవీలపై కేటీఆర్ కామెంట్

సాహో, ఎవరు మూవీలపై కేటీఆర్ కామెంట్

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సాహోకి మిక్స్ డ్ టాక్ వచ్చినా వసూళ్లలో దూసుకుపోతుంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా  గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ చూసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాహో అధ్బుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. తాను రెండు అధ్బుతమైన సినిమాలు  సాహో,ఎవరు  చూశానన్నారు. అందులో టెక్నికల్ పరంగా సాహో అద్భుతమైన సినిమా అన్నారు. సాహో తెలుగు సినిమా స్థాయిని పెంచిందన్నారు. ప్రభాస్ కు డైరెక్టర్ సుజిత్ కు అభినందనలు తెలిపారు. అలాగే ఎవరు  స్క్రీన్ ప్లే బాగుందన్నారు. అడవిశేష్,రెజీనా అద్భుతంగా నటించారని అన్నారు.