రాబోయే పదేండ్లలో 16 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం

రాబోయే పదేండ్లలో 16 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం

షాద్​నగర్​, వెలుగు: ఎల‌‌‌‌క్ట్రానిక్ పరిక‌‌‌‌రాల ఉత్పత్తి రంగంలో రాబోయే ప‌‌‌‌దేళ్లలో 16 ల‌‌‌‌క్షల ఉద్యోగాలు సృష్టించడమే టార్గెట్​గా పనిచేస్తామని కేటీఆర్​ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పెంజర్ల శివారులో  ప్రాక్టర్​అండ్​ గ్యాంబిల్​(పీఅండ్​బీ)  రూ.రెండు వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన లిక్విడ్ డిటర్జెంట్ తయారీ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తామని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పెట్టుబడిదారులు ఉత్సాహం చూపుతున్నారని, వారికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి కేటీఆర్ ప్రాక్టర్​ అండ్​ గ్యాంబిల్​కు సూచించారు. ఈ ప్లాంటు ఇన్వెస్ట్​మెంట్​ను కలుపుకుంటే తెలంగాణలో పీ అండ్​ జీ పెట్టుబడుల విలువ భారీగా పెరిగిందని మంత్రి వివరించారు.

కంపెనీ ఇండియన్​ సబ్​కాంటినెంట్​ సీఈఓ మధుసూదన్​ గోపాలన్​ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో బిజినెస్​ చేయడం చాలా ఈజీ కాబట్టే మా ప్లాంటు కోసం కొత్తూరును ఎంచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఇండస్ట్రియల్​ పాలసీలు బాగున్నాయి. మౌలిక సదుపాయాలూ మమ్మల్ని ఆకట్టుకున్నాయి. ఇక్కడ తయారైన ప్రొడక్టులను దేశమంతటా అమ్ముతాం. మా బిజినెస్​కు హైదరాబాద్​ మార్కెట్​ చాలా ముఖ్యం. ఈ ప్లాంటుతోపాటు ప్లానింగ్​ సర్వీస్​ సెంటర్​ను, టెక్నాలజీ సెంటర్​ను ఏర్పాటు చేశాం”అని ఆయన వివరించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి,   మహబూబ్ నగర్ ఎంపీ మన్నె  శ్రీనివాస్ రెడ్డి,షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ లు హాజరయ్యారు.  పీ అండ్​జీకి ఈ యూనిట్​ ఇండియాలోనే అతిపెద్దది. దీనిని  170 ఎకరాల్లో నిర్మించారు. ఇక్కడ ఏరియల్​, టైడ్​ వంటి వాషింగ్​ పౌడర్లు, పాంపర్స్​ బ్రాండ్​ బేబీ కేర్​ ప్రొడక్టులు తయారు చేస్తున్నారు.  ఇదిలా ఉంటే, ఈ కార్యక్రమం కోసం వచ్చిన మీడియా వారికి చేదు అనుభవం ఎదురైంది. చాలాసేపు మీడియా ప్రతినిధులు గేట్ బయటే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇతర నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులకు అనుమతి ఇచ్చారు.   మీడియాకు మాత్రం అవకాశం ఇవ్వలేదు.