వరుస ప్రమాదాలు లాస్యను వెంటాడాయి:కేటీఆర్

వరుస ప్రమాదాలు లాస్యను వెంటాడాయి:కేటీఆర్

ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తీవ్రంగా గాయపడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే,  ఆ సమయంలో  కేటీఆర్  విదేశాల్లో ఉన్నారు. దీంతో లాస్య కుటుంబ సభ్యులను కలవలేకపోయారు. తాజాగా విదేశాల నుంచి తిరిగి వచ్చిన కేటీఆర్.. ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం ఉదయం లాస్య నివాసానికి వెళ్లి.. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.  వారి మాట్లాడి.. ధైర్యం చెప్పారు కేటీఆర్. పార్టీ, తామా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  ప్రజల హృదయాల్లో చోటు సంపాదించిన యువ ఎమ్మెల్యే, సోదరి లాస్య నందిత అకాల మరణం మా అందరికీ ఎంతో బాధ కలగించింది. చిన్న వయసులోనే లాస్య చనిపోవడం మా పార్టీతోపాటు కంటోన్మెంట్ ప్రజలను తీవ్రంగా బాధపెట్టిందన్నారు. వరుస ప్రమాదాలు లాస్యను వెంటాడాయన్నారు.  సంవత్సరం క్రితమే దివంగత ఎమ్మెల్యే సాయన్న కూడా మరణించారు.. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుతున్నట్లు చెప్పారు.  ఆవేధన  కేటీఆర్ వెంట మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అలా వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాల్ రాజ్, మహమూద్ అలీ వెళ్లారు.