
- రాష్ట్రాన్ని కేంద్రం చేతిలో పెడుతున్నరు: కేటీఆర్
- ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ అడ్డగోలు మాటలు చెప్పిండు
- ప్రధాన ప్రతిపక్షంగా ఇంకా మేం మాట్లాడుడు మొదలుపెట్టలేదు
- కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో
- ముగిసిన సన్నాహక సమావేశాలు
హైదరాబాద్, వెలుగు : కరెంట్బిల్లులు కట్టొద్దని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నవంబర్నెలలోనే అన్నారని, అదే విషయం తాను గుర్తు చేశానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండ ప్రజలు తమ కరెంట్బిల్లులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి పంపించాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరెంట్కోతలు మొదలయ్యాయని.. రానున్న రోజుల్లో మరిన్ని కోతలు తప్పవని అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు క్రాప్హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టును ఎండ బెడుతున్నారని విమర్శించారు.
‘‘శ్రీశైలం, నాగార్జున సాగర్ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ప్రభుత్వం కేంద్రం చేతిలో పెడుతున్నది” అని దుయ్యబట్టారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నల్గొండ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ నెల 3న ఆదిలాబాద్లోక్సభ నియోజకవర్గంతో మొదలైన బీఆర్ఎస్ లోక్సభ సన్నాహక సమావేశాలు సోమవారం ముగుస్తున్నాయని ఆయన చెప్పారు. 16 లోక్సభ సన్నాహక సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని అన్నారు.
నల్గొండలో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు పరిస్థితి బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నట్టు అనిపించిందని, ఓడిపోతమన్న అనుమానం ఎక్కడ కూడా రాలేదని, కానీ సూర్యాపేట ఒక్క సీటులోనే గెలిచామని కేటీఆర్ పేర్కొన్నారు. నాడు పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు చెప్తున్నారని అన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు
నిర్వహిస్తామన్నారు.
కాంగ్రెస్కు ప్రజలు దూరమవుతారు
పార్టీ, ప్రభుత్వంపై సోషల్మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామని కేటీఆర్ అన్నారు. ‘‘ప్రధాన ప్రతిపక్షంగా ఇంకా మాట్లాడటమే మొదలు పెట్టలేదు.. రేపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలి. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్వాళ్లు కలలో కూడా అనుకోలేదు.. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నరు” అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్రెడ్డి అడ్డగోలు మాటలు చెప్పారని
ఎన్నికలకు ముందు కాంగ్రెస్నాయకులు ఏం చెప్పారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారో ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన సూచించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్గొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడింది. రేవంత్భుజంపై మోదీ తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను కాల్చాలని చూస్తున్నరు” అని ఆరోపించారు. కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, పార్లమెంట్ఎన్నికల్లో దానిని సానుకూలంగా మలుచుకోవాలని కార్యకర్తలకు
సూచించారు.
కాంగ్రెస్ ఎండ్రికాయల పార్టీ : హరీశ్
గోబెల్స్ను మించి బీఆర్ఎస్ పై కాంగ్రస్పార్టీ దుష్ప్రచారం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘ప్రచారంలో అబద్ధం.. పాలనలో అసహనం.. ఇదే కాంగ్రెస్తీరు. అది ఎండ్రికాయల పార్టీ. ఒకరి కాలు ఇంకొకరు పట్టి లాగుతుంటరు” అని దుయ్యబట్టారు. లోక్సభ సన్నాహక సమావేశాల్లో 125 గంటల పాటు చర్చ జరిగిందని, కార్యకర్తలు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారని అన్నారు.
20 రోజుల్లోనే పార్లమెంట్ఎన్నికల కోడ్వచ్చేస్తుందని, ఆలోగానే కాంగ్రెస్ఆరు గ్యారంటీల్లోని 13 హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్పేరుతో కేసీఆర్ దేశవ్యాప్తంగా తిరిగితే బలోపేతం అవుతారని మోదీ భయపడి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సహకరించారని, రాహుల్ను ఎదుర్కోవడం కన్నా కేసీఆర్ ను ఎదుర్కోవడమే కష్టమని ఆయన అనుకున్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
నందినగర్ఇంటికి కేటీఆర్, హరీశ్.. ప్రముఖుడితో భేటీ!
నల్గొండ లోక్సభ సన్నాహక సమావేశం లంచ్బ్రేక్లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు నందినగర్లోని నివాసానికి వెళ్లారు. గన్మన్లను తెలంగాణ భవన్లోనే వదిలేసి కేటీఆర్ కారులో ఇద్దరు కలిసి నందినగర్లోని ఇంటికి వెళ్లారు. వారిద్దరితో పాటు డ్రైవర్మాత్రమే కారులో ఉన్నారు. ఒక ప్రముఖుడిని లంచ్కు ఆహ్వానించారని, ఆయనతో లంచ్భేటీకే ఇద్దరు నేతలు వెళ్లారని తెలిసింది.
నల్గొండ ఎంపీ టికెట్ఇంకా ఖరారు కాలే
బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్తో నల్గొండ జిల్లా బీఆర్ఎస్నాయకులు సోమవారం రాత్రి భేటీ అయ్యారు. గుత్తా అమిత్రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్రెడ్డితో పాటు పలువురు నాయకులు కేటీఆర్ నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. నల్గొండ లోక్సభ టికెట్గుత్తా సుఖేందర్రెడ్డి, అమిత్లలో ఎవరికి ఇచ్చిన తమకు అభ్యంతరం లేదని వాళ్లు కేటీఆర్కు చెప్పినట్టు తెలిసింది. నల్గొండ ఎంపీ టికెట్ఎవరికి ఇవ్వాలనేది ఇంకా ఖరారు కాలేదని, పార్టీ చీఫ్ కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ తెలిపారు.
ఇంకా మా గొంతు నొక్కుతున్నరు : నల్గొండ బీఆర్ఎస్ కార్యకర్తలు
లోక్సభ సమీక్ష సమావేశాల్లోనూ తమ గొంతు నొక్కుతున్నారని బీఆర్ఎస్కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నల్గొండ లోక్సభ సన్నాహక సమావేశంలో కార్యకర్తలు తమ ఆందోళనను వెలిబుచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తమపై కేసులు, రౌడీషీట్లు పెట్టారని గుర్తుచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులకు కాకుండా వలస వచ్చిన నేతలకు పదవులు ఇచ్చారని తెలిపారు. తమ బాధలు చెప్పుకుందామన్న ఏ ఒక్క అవకాశం రాలేదన్నారు. కనీసం గ్రామ కమిటీల్లో అవకాశం కల్పించినా పార్టీ కోసం పని చేసేవాళ్లమని వెల్లడించారు.
కమిటీలు లేకపోవడంతోనే పార్టీతో ప్రజలకు సంబంధం లేకుండా పోయిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే అవకాశం పోయిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ సమీక్షా సమావేశాల్లో తమ బాధలు చెప్పుకుందామన్నా విమర్శలు చేయొద్దు అంటూ పలువురు నేతలు ఆంక్షలు పెడుతున్నారని వివరించారు. పార్టీ కోసం పనిచేసే నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలని, వెంటనే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీ హైకమాండ్ ను కోరారు