దుబ్బాకలో ఆశించిన ఫలితం రాలేదు

దుబ్బాకలో ఆశించిన ఫలితం రాలేదు

హైదరాబాద్: విజయాలకు పొంగిపోము. అపజయాలకు కుంగిపోమ్మాన్నారు మంత్రి కేటీఆర్. దుబ్బాక ఎన్నికల ఫలితాలపై మంగళవారం ఆయన తెలంగాణ భవన్ లో మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ఓటింగ్ సరళి…అప్రమత్తంగా ఉండేందుకు ఉపయోగపడిందన్నారు. లోతుగా సమీక్షించి నెక్స్ట్ స్టెప్ వేస్తామన్నారు. మా పనిమాత్రం ఆపమన్న కేటీఆర్.. ఈ ఫలితాల్లో మేము ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. 62 వేలకు పైగా ఓట్లు వేశారని.. వారికి ఋణపడి ఉంటామన్నారు. టీఆర్ఎస్ కు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు మంత్రి కేటీఆర్.