పద్మారావునగర్, వెలుగు: ఓటరు నమోదు, పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 31న సికింద్రాబాద్ కంటోన్మెంట్కు రానున్నారు. బాలంరాయ్లోని క్లాసిక్ గార్డెన్లో నిర్వహించనున్న ఈ శిక్షణా శిబిరంలో బూత్ స్థాయి నాయకులు పాల్గొంటారు.
గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ వేదికగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని కంటోన్మెంట్ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ మన్నె క్రిశాంక్ తెలిపారు.
