నాగర్ కర్నూల్ , వెలుగు: కాంగ్రెస్లో చేరడానికి అంతా రెడీ చేసుకున్న ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సోమవారం గద్వాలలో జరిగిన సీఎం కేసీఆర్ మీటింగ్లో ప్రత్యక్షమయ్యారు. బీఆర్ఎస్లో ఉంటూ కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన కూచుకుళ్ల సీఎం సభలో కనిపించి మరింత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సపోర్ట్ చేయనని కాంగ్రెస్ కీలక నేతలతో వరుసగా భేటీ అయిన కూచుకుళ్ల ఆ పార్టీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారనే వార్తలొచ్చాయి.
ఓపెన్గా కాంగ్రెస్ నేతలను కలిసిన తర్వాత దాచిపెట్టదానికి ఏం లేదని స్పష్టం చేసిన దామోదర్ రెడ్డి కొడుకు డా. రాజేశ్ రెడ్డి పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలోనే క్లియర్ అవుతుందని కూడా చెప్పారు. కాంగ్రెస్లో కూచుకుళ్ల చేరికపై తేదీల గురించి చర్చ జరుగుతున్న టైంలో గద్వాల సీఎం సభలో కనిపించడంపై అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్లోనూ చర్చ నడుస్తోంది. గద్వాల స్టేజీ దిగిన తర్వాత మీడియాతో చిట్చాట్ చేసిన కూచుకుళ్ల ''పరిస్థితులు బాగాలేవు. ఏమవుతుందో అర్థం కావడం లేదు. ప్రస్తుతం తాడు మీద నడుస్తున్న అని కామెంట్ చేశారు''.