- హోర్డింగ్స్ పడి ఇద్దరికి గాయాలు
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి వై జంక్షన్లోని లేక్ షోర్ మాల్లో ఆదివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. మాల్ లోపల ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్స్, సైన్ బోర్డులు ఒక్కసారిగా పైనుంచి కింద పడడంతో షాపింగ్కు వచ్చిన గద్దె మనోజ్ఞ (27), బండి దివ్య (27) అనే ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.
హోర్డింగ్స్ పడిన సమయంలో ఆ ప్రాంతంలో జనం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఇటీవలే మాల్ ప్రారంభం కాగా, ప్రజలు ఉన్న సమయంలోనే ప్రమాదకరంగా పనులు చేపట్టడంపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఈఘటనపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
