ఖుషీ మూవీ.. ఆంధ్రలో రూ.20 కోట్ల బిజినెస్

ఖుషీ మూవీ.. ఆంధ్రలో రూ.20 కోట్ల బిజినెస్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఆపిల్ బ్యూటీ సమంత నటిస్తున్న మూవీ ఖుషి(Kushi). ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ వచ్చే నెల సెప్టెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ కానుంది.

లేటెస్ట్ గా ఖుషి  ప్రొడక్షన్ హౌస్ మైత్రి మేకర్స్ థియేట్రికల్ బిజినెస్ గట్టిగానే చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రా ఏరియాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను రూ.20 కోట్లకు పైగా విక్రయించగా.. నైజాం ప్రాంతంలో సొంతంగానే రిలీజ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే సీడెడ్ ఏరియాలోరూ. 6 కోట్లు, ఓవర్సీస్​లో రూ.7.5 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని నిపిస్తోంది. 

ఓవరాల్‌గా ఖుషి మూవీతో మైత్రి మేకర్స్ ప్రొడ్యూసర్స్కు థియేట్రికల్ డీల్స్ ద్వారా రూ.60 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక ఖుషి మూవీకు నాన్ థియేట్రికల్ వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి.ఓవరాల్‌గా ఈ సినిమా విడుదలకు ముందే 100 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. 

ఖుషి మూవీతో విజయ్ ముందుగానే..ట్రాక్​ ​రికార్డ్ సొంతం చేసుకున్నారు. విజయ్ దేవరకొండకు ఈ రేంజ్​లో బిజినెస్ జరగడమంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కు గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ హిట్ టాక్ తెచ్చుకుందంటే కలెక్షన్స్ సాధించడం కన్ఫర్మ్ అంటున్నారు ట్రేడ్ నిపుణులు. 

నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ సినిమాలు తీసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. ఖుషి సినిమా థియేటర్లలో 2023 సెప్టెంబర్ 1న తెలుగు,తమిళం,మలయాళం, హిందీ,కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.