
హైదరాబాద్, వెలుగు: రేషన్ కార్డుల్లో కేవైసీ నిబంధనలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ రూల్ను మరోసారి సమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు మంత్రి గంగుల కమలాకర్ సోమవారం లేఖ రాశారు. రేషన్ కార్డుల్లో కొత్తగా కేవైసీ నిబంధనలు అమలు చేయాలనే కేంద్రం ఆదేశాలతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నదన్నారు. గతంలో రాష్ట్రంలో ఉపాధి లేక చాలా మంది గల్ఫ్, ఇతర దేశాలతో పాటు ముంబై, బీవండి తదితర ప్రాంతాలకు వలస వెళ్లారని, వారంతా కేవైసీ చేసుకునేందుకు ఇక్కడికి రాలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని కొన్ని సడలింపులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.