
బాలకృష్ణ కెరీర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటి ‘లక్ష్మీ నరసింహా’. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని 4కె వెర్షన్లో జూన్ 8న థియేటర్స్లో వరల్డ్ వైడ్ గ్రాండ్గా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ వెర్షన్లో కొత్త పాటను యాడ్ చేశారు. ‘మందేసినోడు’ అంటూ సాగే పాటని భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశాడు. స్వరాగ్ కీర్తన్ హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ కి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ మాస్ని కట్టిపడేసే లిరిక్స్ను అందించారు.
ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకుడు జయంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఇందులోని స్పెషల్ సాంగ్ కోసం చంద్రబోస్, భీమ్స్ కలిసి అద్భుతం చేశారు’ అని అన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ ‘నా 31 ఏళ్ల సినీ సాహిత్య ప్రయాణంలో అతి విచిత్రమైనటువంటి విన్యాసం చేసిన పాట ఇది.
మధురమైన పాటగా నిలిచిపోతుంది. ఈ పాటని బాలయ్యబాబు అభిమానులు అందరికి అంకితం ఇస్తున్నాం’ అని అన్నారు. ఈ పాటకి పనిచేయడం చాలా స్పెషల్ అని భీమ్స్ చెప్పాడు. రీ రిలీజ్లో ఈ పాట ప్రత్యేకంగా నిలుస్తుందని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు.