
- భక్తుల జయజయ ధ్వానాలతో ఊగిపోయిన పాతబస్తీ
- వేలాదిగా పాల్గొన్న భక్తులు
- స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన నాలుగు యుగాల శకటాలు
హైదరాబాద్, వెలుగు: పాతబస్తీలో ఘటాల ఊరేగింపు ధూం..ధాంగా సాగింది. సోమవారం సాయంత్రం లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం వద్ద రంగం నిర్వహించారు. తర్వాత ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో హరిబౌలిలోని అక్కన్నమాదన్న ఆలయం నుంచి ఘటాల ఊరేగింపు మొదలైంది. సిటీ సీపీ శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అంబారీపై కొలుదీరిన సింహవాహిని మహంకాళి పాతబస్తీ పురవీధుల్లో ముందుకు సాగగా, దారిపొడవునా భక్తులు ఘన స్వాగతం పలికారు.
నాలుగు యుగాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన శకటాలు స్పెషల్అట్రాక్షన్గా నిలిచాయి. మీర్ఆలం మండి శ్రీమహంకాళేశ్వర ఆలయ ఘటం భారీ శకటాలు ముందుకు సాగాయి. తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన 400 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో అదరగొట్టారు. స్పెషల్క్రాకర్స్, లైటింగ్షోలతో చార్మినార్, మక్కా మసీదుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు దద్దరిల్లాయి.