విజయ్ టీవీకే బహిరంగ సభలో తొక్కిసలాట.. 400 మందికి అస్వస్థత.. ఒకరు మృతి

విజయ్ టీవీకే బహిరంగ సభలో తొక్కిసలాట.. 400 మందికి అస్వస్థత.. ఒకరు మృతి

నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తొక్కిలాట చోటు చేసుకుంది. గురువారం (ఆగస్టు 21) తమిళనాడు మధురై లో ఏర్పాటు చేసిన సభకు అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. దాదాపు 4 లక్షల మంది సభకు హాజరయ్యారు. రద్దీ ఎక్కువ అవ్వటంతో సభలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఏకంగా 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు. 


విజయ్ టీవీకే పార్టీ రెండవ మహానాడు సందర్భంగా తోపులాట కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నాలుగు వందలకు పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇందులో  ఒకరు మృతి చెందగా12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. .