తమ ప్లాట్లను నిర్మాత సి.కళ్యాణ్ కబ్జా చేశారు

తమ ప్లాట్లను నిర్మాత సి.కళ్యాణ్ కబ్జా చేశారు
హైదరాబాద్ : హఫీజ్ పేట్ సర్వే నెంబర్ 80 భూబాధితులు..చందానగర్ మున్సిపల్ ఆఫీస్ ను ముట్టడించారు. 30 ఏళ్ళ కింద కొన్న ప్లాట్లను నిర్మాత సి.కళ్యాణ్ కబ్జా చేశారని ఆందోళన చేశారు. కోర్టు తమ పక్షాన తీర్పు ఇచ్చినా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ ప్లాట్లలోకి వెళ్లకుండా సి.కళ్యాణ్ రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారని చెప్పారు.