బల్బు విషయంలో గొడవ: కౌలురైతును చంపేసిన భూస్వామి

బల్బు విషయంలో గొడవ: కౌలురైతును చంపేసిన భూస్వామి

న్యూఢిల్లీ: కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చే బల్బు వాడినందుకు జరిగిన ఘర్షణలో భూస్వామి చేతిలో కౌలుదారు చనిపోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జగదీశ్ అనే ఈ–రిక్షా డ్రైవర్ తన భార్య, ఎనిమిదేళ్ల కూతురుతో కలసి ఢిల్లీలోని హర్ష్ విహార్ బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నాడు. అదే బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో అమిత్ అనే భూస్వామి తన ఫ్యామిలీతో ఉంటున్నాడు. జగదీశ్ వైఫ్ కిచెన్ లో ఉండగా 7.45 గంటల సమయంలో ఆ ఇంట్లోకి వచ్చిన అమిత్ ఎలక్ట్రిసిటీని ఎక్కువగా తీసుకునే 100 వాల్ట్ బల్బ్ వాడకంపై అభ్యంతరం తెలిపాడు. ఆ బల్డ్ స్థానంలో ఒక ఎల్ఈడీ బల్బును అమిత్ రీప్లేస్ చేశాడు. ఈ విషయంపై అమిత్, జగదీశ్ ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో జగదీశ్ ను అమిత్ రెండు సార్లు చెంపదెబ్బ కొట్టగా.. అతడు మంచంపై అపస్మారక స్థితిలో పడిపోయాడు. జగదీశ్ భార్య అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ, ట్రీట్ మెంట్ జరుగుతున్న టైమ్ లో జగదీశ్ చనిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో ఇంటర్నల్ గా రక్త స్రావం కావడంతోనే జగదీశ్ చనిపోయాడని పోస్ట్ మార్టంలో తేలింది. జగదీశ్ భార్య కంప్లెయింట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. అమిత్ ను అరెస్ట్ చేశారు.