న్యూఢిల్లీ: కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చే బల్బు వాడినందుకు జరిగిన ఘర్షణలో భూస్వామి చేతిలో కౌలుదారు చనిపోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జగదీశ్ అనే ఈ–రిక్షా డ్రైవర్ తన భార్య, ఎనిమిదేళ్ల కూతురుతో కలసి ఢిల్లీలోని హర్ష్ విహార్ బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నాడు. అదే బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో అమిత్ అనే భూస్వామి తన ఫ్యామిలీతో ఉంటున్నాడు. జగదీశ్ వైఫ్ కిచెన్ లో ఉండగా 7.45 గంటల సమయంలో ఆ ఇంట్లోకి వచ్చిన అమిత్ ఎలక్ట్రిసిటీని ఎక్కువగా తీసుకునే 100 వాల్ట్ బల్బ్ వాడకంపై అభ్యంతరం తెలిపాడు. ఆ బల్డ్ స్థానంలో ఒక ఎల్ఈడీ బల్బును అమిత్ రీప్లేస్ చేశాడు. ఈ విషయంపై అమిత్, జగదీశ్ ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో జగదీశ్ ను అమిత్ రెండు సార్లు చెంపదెబ్బ కొట్టగా.. అతడు మంచంపై అపస్మారక స్థితిలో పడిపోయాడు. జగదీశ్ భార్య అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ, ట్రీట్ మెంట్ జరుగుతున్న టైమ్ లో జగదీశ్ చనిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో ఇంటర్నల్ గా రక్త స్రావం కావడంతోనే జగదీశ్ చనిపోయాడని పోస్ట్ మార్టంలో తేలింది. జగదీశ్ భార్య కంప్లెయింట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. అమిత్ ను అరెస్ట్ చేశారు.
బల్బు విషయంలో గొడవ: కౌలురైతును చంపేసిన భూస్వామి
- క్రైమ్
- May 25, 2020
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి