
హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో డీజిపిని కలిసారు న్యాయవాది. ఆత్మహత్య చేసుకుంటానని జూలై 12న రాత్రి న్యాయవాది రాజేష్ కు మెసేజ్ చేసింది లావణ్య. దీంతో లావణ్యకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరారు ఆమె తరపు న్యాయవాది రాజేష్. నిన్న అర్ధరాత్రి లావణ్య కాల్ చేసి కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగింది. రాజ్ తరుణ్ అరెస్ట్ అవుతాడా, నన్ను పెళ్లి చేసుకుంటాడా, నా పై దాడి చేస్తాడా అని అడిగింది. మరో అరగంట తర్వాత నేను ఉండలేను అంటూ మెసేజ్ చేసింది. వెంటనే 100 కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాను. వెంటనే పోలీసులు ఆమెను రిస్క్యూ చేసి కాపాడారు. లావణ్యను స్టేట్ హోమ్ కు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీని కోరారు న్యాయవాది.
ఈ లోకంలో నా పయనం పూర్తి చేసాను. అందుకే ఈ లోకం నుండి వెళ్లిపొతున్నాను.నేను ఏంటో తెలిసిన మనుషులే నన్ను తప్పు బట్టారు .నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు. రాజ్తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు .మైండ్ గేమ్, గాసిప్స్తో విసిగిపోయాను. మస్తాన్ కేసులో నేను కీలు బోమ్మను అయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మాల్విని బతిమలాడాను.. కానీ మాల్వి నిపించుకోలేదు. నా చావుకు కారణం రాజ్తరుణ్, అతని తల్లిదండ్రులే.నా చావుకు ప్రధాన కారకురాలు మాల్వీ మలోత్రా. నాకు తినడానికి తిండి లేదని మొత్తుకుంటున్నా. రాజ్తరుణ్తో మాల్వీ మల్హోత్రా ఎంజాయ్ చేస్తోంది. రాజ్తరుణ్, మాల్వీ మోజులో పడి మారిపోయాడు. రాజ్తరుణ్ నా మరణాన్ని కోరుకుంటున్నాడు అని లావణ్య సూసైడ్ నోట్ లో ఆవేదన వ్యక్తం చేసింది.