నల్గొండ, భువనగిరి జిల్లాలో.. పార్లమెంట్‌‌ ఫైట్‌‌కు రెడీ!

నల్గొండ, భువనగిరి జిల్లాలో.. పార్లమెంట్‌‌ ఫైట్‌‌కు రెడీ!
  •     రెండు సెగ్మెంట్లలో మొదలైన ఎన్నికల వేడి
  •     టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించిన ఆశావహులు
  •     అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో  కాంగ్రెస్‌‌ తీవ్ర పోటీ 
  •      బీఆర్‌‌‌‌ఎస్‌‌, బీజేపీ తరఫున ఆసక్తి చూపిస్తున్న సీనియర్లు 

నల్గొండ, వెలుగు : పార్లమెంట్‌‌ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ హీట్ మొదలైంది.  నల్గొండ, భువనగిరి పార్లమెంట్​స్థానాల్లో పోటీకి ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సామాజిక సమీకరణాలు, పార్టీలో సీనియారిటీ, బలాబలాలు బేరీజు వేసుకొని ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు.  మొన్ననే కాంగ్రెస్‌‌ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది.  

బీఆర్ఎస్‌‌లో పదేళ్లుగా ఎలాంటి పదవి లభించని సీనియర్లు ఎంపీ టికెట్​కోసం ఫైట్​చేస్తున్నారు.  బీజేపీ నుంచి సైతం సీనియర్లు బరిలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నా రు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్​ఎన్నికల్లోనూ ముక్కోణపు పోటీ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

సామాజిక సమీకరణాలే ప్రధానం 

ఎంపీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలే కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఎంపీసెగ్మెంట్​ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్​ ఆలేరుతోనే సరిపెట్టింది. ఇక బీఆర్ఎస్​ పాత సంప్రదాయాన్నే కొనసాగించింది. కోదాడ, నాగార్జునసాగర్​ బీసీలకు ఇచ్చింది. బీజేపీ సైతం ఆలేరు, నల్గొండలో బీసీ అభ్యర్థులతో ప్రయోగం చేసి ఫెయిలైంది.

ఇదే ఫార్ములా పార్లమెం ట్​ ఎన్నికల్లో కొనసాగుతుందనే నమ్మకం లేదని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. 2018 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ రెండు ఎంపీ సీట్లు రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వడంతో విజయం సాధించింది. అదే బీఆర్​ఎస్​ నల్గొండ సీటు రెడ్లకు, భువనగిరి బీసీలకు ఇచ్చింది. దీనివల్ల ప్రతికూల ఫలితాలే వచ్చాయి. బీజేపీ నల్గొండ స్థానాన్ని ఆర్యవైశ్యులకు, భువనగిరి వెలమ సామాజిక వర్గానికి కేటాయించినా.. విజయం దక్కలేదు. 

కాంగ్రెస్ ​పక్కా వ్యూహం

అసెంబ్లీ ఎన్నికల ఆపరేషన్ విజయవంతం చేయడంలో కాంగ్రెస్​ అగ్రనేతలు సక్సెస్​ అయ్యారు. 12 స్థానాలకు గాను 11 చోట్ల పార్టీ అభ్యర్థులు గెలిచారు.   ఇదే తరహా వ్యూహాన్ని పార్లమెంట్​ ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు పార్టీ హైకమాండ్ తాజా మాజీ ఎంపీలను ఇన్​చార్జిలుగా నియమించింది. దీంతో అభ్యర్థుల ఎంపిక అంత ఆషామాషీ కాదని తేలిపోయింది. నల్గొండ ఎంపీగా సీనియర్​ నేత జానారెడ్డి పోటీ చేస్తానని ప్రకటించినప్పటికీ  చివరకు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఊహించలేమని సీనియర్​నేత ఒకరు చెప్పారు.

అట్లాగే భువనగిరి సెగ్మెంట్​ నుంచి చామల కిరణ్​ కుమార్​రెడ్డి రేసులో ఉన్నానని చెబుతున్నా...జానారెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్​ కసిరెడ్డి నారాయణ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి పార్టీ వదిలివెళ్లినప్పుడు డీసీసీ ప్రెసిడెంట్​గా కసిరెడ్డిని నియమిస్తారని భావించారు. కానీ, ఆయన ఎంపీ సీటుపై కసిరెడ్డి ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. 

పట్టు నిలుపుకునే పనిలో బీఆర్‌‌‌‌ఎస్‌‌

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే జనాల్లోకి రావడం మొదలు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి అక్కడక్కడ ఆత్మీయ సమావేశాలు పెడ్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ టికెట్​ ఆశిస్తున్న వారు పార్టీ వర్కిం గ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​, జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌‌​ రెడ్డిని సంప్రదిస్తున్నట్టు తెలిసింది. పార్టీ ఆదేశిస్తే నల్గొండ ఎంపీగా పోటీ చేస్తానని గు త్తా అమిత్​ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అదేబాటలో బీసీ సామాజిక వర్గా ని చెందిన సీనియర్​ నేత సుంకరి మల్లేశ్‌‌​గౌడ్ సైతం పోటీ చేస్తానని చెబుతున్నారు.

డీసీసీబీ చైర్మన్​ పదవి ఆశించి భంగపడ్డ మల్లేశ్‌‌​గౌడ్‌‌తో పాటు తెలంగాణ ఉద్యమనేత చాడ కిషన్​ రెడ్డి సైతం రేసులో ఉన్నారు.  భువనగిరి సెగ్మెంట్​ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, డాక్టర్​చెరుకు సుధాకర్​ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్​ పేర్లు వినిపిస్తుండగా, ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని సీనియర్లు అంటున్నారు. 

బీజేపీలో సీనియర్ల ఆసక్తి

బీజేపీలో సీనియర్లు, ఆర్ఎస్ఎస్​తో సన్నిహిత సంబంధాలు కలిగిన నాయకులు పార్లమెంట్​ రేసులో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకు లు ప్రముఖ న్యాయవాది నూకల నర్సింహారెడ్డి, గోలి మధుసూధన్​ రెడ్డి నల్గొండ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నర్సింహారెడ్డి భావించారు. కానీ పార్టీ సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఛాన్స్ మిస్సైంది. అయితే ఈ దఫా ఎంపీగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మధుసూధన్​ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలనే నిర్ణయానికి రావడమేగాక, నిధుల సమీకరణ కోసం విదేశీ పర్యటనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  

గత ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన గార్లపాటి జితేందర్​ కూడా రేసులో ఉన్నారని అంటున్నారు. భువనగిరి ఎంపీ సెగ్మెంట్​ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్​సుందర్​రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో శ్యాంసుందర్​రావు ఎంపీగా పో టీ చేశారు. అయితే ఎంపీ టికెట్​ హామీ ఇవ్వడంతోనే నర్సయ్యగౌడ్​ బీఆర్​ ఎస్​ నుంచి బీజేపీలో చేరారని చెబుతున్నారు. కానీ శ్యాంసుందర్​రావు తనకే టికెట్​ వస్తదన్న నమ్మకంతో నియోజకవర్గాల వారీగా పార్టీ మీటింగులు పెట్టి కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.