కేసీఆర్ సారీ చెప్పి తీరాల్సిందే

కేసీఆర్ సారీ చెప్పి తీరాల్సిందే

ముషీరాబాద్,వెలుగు: రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ దేశ ప్రజలకు సారీ చెప్పాలని దళిత్ శక్తి ప్రోగ్రామ్(డీఎస్ పీ) నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్​పీ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం  ఇందిరాపార్క్ ధర్నా చౌక్​లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. డీఎస్ పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ హాజరై దీక్షకు మద్దతు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే  నిరసన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామన్నారు. రాష్ట్ర కార్యదర్శి శివన్,  హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ మహారాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.