![‘యూఏఈ’కు లీ ఫార్మా స్మూత్వాక్ టాబ్లెట్స్](https://static.v6velugu.com/uploads/2023/11/lee-pharma-to-launch-bio-cartilage-smoothwalk-tablets-in-the-uae_9kuKmbR1TN.jpg)
హైదరాబాద్, వెలుగు : ఫార్మాస్యూటికల్ కంపెనీ లీ ఫార్మా.. కీళ్ల వ్యాధి చికిత్సలో వాడే బయో-కార్టిలేజ్ స్మూత్వాక్ టాబ్లెట్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతంలో మార్కెట్ చేయనుంది. యూఏఈకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి ఈ మేరకు అనుమతి పొందింది. భారత్ లో తయారైన ఇటువంటి ఉత్పాదనకు యూఏఈలో ఆమోదం రావడం ఇదే మొదటిసారి అని ప్రకటించింది. ఈ ఉత్పత్తిని ఆన్ని మధ్యప్రాచ్య దేశాలలో, తూర్పు ఆసియా దేశాలలో విక్రయించేందుకు కంపెనీ దరఖాస్తు చేసుకుంది. అలాగే మార్కెటింగ్ ఆథరైజేషన్ కోసం యూఎస్ ప్రభుత్వానికి 2024 మూడవ క్వార్టర్లో దరఖాస్తు చేస్తామని కంపెనీ డైరెక్టర్ లీలా రాణి ఈ సందర్భంగా తెలిపారు.