చెరువులో చిరుత కళేబరం

చెరువులో చిరుత కళేబరం

మెదక్/చిన్నశంకరంపేట, వెలుగు: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్​గ్రామ పటేల్​ చెరువులో చిరుతపులి కళేబరాన్ని గ్రామస్థులు గుర్తించారు. మంగళవారం ఉదయం చెరువు కట్ట మీదుగా పొలాలకు వెళ్తున్న  రైతులకు చెరువులో చిరుత కళేబరం కనిపించింది. వెంటనే ఫారెస్ట్​ ఆఫీసర్లకు సమాచారం అందించారు. డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెటర్నరీ డాక్టర్​తో పోస్టుమార్టం చేయించి శాంపిల్స్​సంగారెడ్డికి పంపించారు. ల్యాబ్​రిపోర్టును బట్టి చిరుత ఎలా చనిపోయిందో తెలుస్తుందని డీఎఫ్ఓ చెప్పారు.