ఖైరతాబాద్, వెలుగు : బీఆర్ఎస్ పార్టీ ఆదివాసీలకు, గిరిజనులకు తీవ్ర ద్రోహం చేసిందని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉషాకిరణ్ మండిపడ్డారు. ఆదివాసీలు, గిరిజనుల జీవనాధారమైన జీఓ నం.3ను సుప్రీంకోర్టు కొట్టివేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు. తమను పట్టించుకోని బీఆర్ఎస్ ను అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించామని, లోక్సభ ఎన్నికల్లోనూ తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ట్రైబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గిరిజనులంతా కాంగ్రెస్అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని, కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు.
ప్రత్యేక ఎస్టీ కమిషన్తోపాటు ట్రైబల్ యూనివర్సిటీఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మేడ విజయ్, డాక్టర్స్టీఫెన్, దేవర విజయ, రామస్వామి, సురేశ్, శేఖర్, గంగాధర్ పాల్గొన్నారు.