ఇంఫాల్: మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది దేశం మొత్తం సిగ్గుపడేలా చేసిందని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని చెప్పారు. గురువారం వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ కాంప్లెక్స్ లో మోదీ మీడియాతో మాట్లాడారు. మణిపూర్ ఆడబిడ్డలకు జరిగిన దారుణం ఎన్నటికీ క్షమించలేనిదని ఆయన అన్నారు. ‘‘ఈ ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసింది. నా హృదయం కోపం, బాధతో బరువెక్కింది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని దేశ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. చట్టం పూర్తి శక్తితో పని చేస్తుంది” అని చెప్పారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ దిశగా అన్ని రాష్ట్రాలు చట్టాలను కఠినం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలను ప్రస్తావించారు. ‘‘మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి. మహిళలను గౌరవించాలి. వాళ్లపై జరుగుతున్న నేరాలపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలి” అని సూచించారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.
దోషులను వదిలిపెట్టం: మోదీ
- దేశం
- July 21, 2023
లేటెస్ట్
- చిన్న విషయాలకే : కారు పార్కింగ్ విషయంలో గొడవ.. ఒకరిని కొట్టి చంపారు
- Pushpa 2: ఈ క్రేజ్ ఏంది సామీ.. ముంబై లోకల్ ట్రైన్ లో పుష్ప రాజ్ మ్యానియా
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సీబీఐకి నోటీసులిచ్చిన హైకోర్టు
- చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి
- సుప్రీంకోర్టు కీలక తీర్పు: మనీలాండరింగ్ కేసులో అరెస్టులపై కండిషన్స్
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- CSK vs RCB : చెన్నైతో మ్యాచ్ .. ఆర్సీబీకి వర్ష గండం.. రద్దయితే ఇంటికే
- Good Health: పొన్నగంటి... పోషకాల గని
- Antony Ruben: చివరి నిమిషంలో పుష్ప 2 టీమ్కి భారీ షాక్.. టీమ్ నుండి స్టార్ ఎడిటర్ అవుట్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం