లోక్​సభ ఎన్నికల్లో.. కాంగ్రెస్​ను గెలిపిద్దాం :బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

లోక్​సభ ఎన్నికల్లో.. కాంగ్రెస్​ను గెలిపిద్దాం :బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

నిజామాబాద్​, వెలుగు:  లోక్​సభ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్​ను గెలిపిద్దామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అర్బన్​ పార్టీ మీటింగ్​లో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తల  కృషివల్లే కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిందన్నారు. అదే  స్ఫూర్తితో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లోనూ  కాంగ్రెస్​కు  విజయం చేకూర్చాలన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ  పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి తగిన పదవులను ఇస్తామన్నారు. 

అర్బన్​ సమస్యలను సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాగా మాజీ మేయర్​ సంజయ్​ ధర్మపురి అలక వహించి సభ మధ్యలో నుంచి వెళ్లిపోయారు.  తనకు మాట్లాడే చాన్స్​ ఇవ్వకపోవడంతో పాటు మీటింగ్​కు ఆలస్యంగా వచ్చిన  మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు తన చైర్​ ఇవ్వమని కోరడాన్ని అవమానంగా భావించారు. సంజయ్ ఆయన వెంట వచ్చిన అనుచరులు సభ నుంచి వెళ్లిపోయారు. మహేశ్​ గౌడ్​, ఆకుల లలిత, మానాల మోహన్​రెడ్డి, నరాల రత్నాకర్​, తాహెర్​ , సీపీఐ నాయకులు సుధాకర్​, ఓమయ్య, ఇమ్రాన్​అలీ, రాధా కుమార్​, భానుచందర్ ఉన్నారు.