
న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో తన వాటాను పెంచుకుంది. ల్ఐసీ ఓపెన్ మార్కెట్ కొనుగోలు ద్వారా ఎస్బీఐలో సోమవారం 0.28 శాతం అదనపు వాటాను కొనుగోలు చేసింది. దీనితో ఎల్ఐసీ వాటా 9.49 శాతానికి చేరుకుంది. ఈ కొనుగోలుతో ఎల్ఐసీ ఎస్బీఐలో కీలకమైన వాటాదారుగా మారింది. ఈ అదనపు షేర్ల కొనుగోలు విలువ దాదాపు రూ. 5,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లావాదేవీల గురించి ఎల్ఐసీ అధికారికంగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.