జీవితమంతా కష్టాలతోనే గడిచిపోయింది : జగ్గారెడ్డి

జీవితమంతా కష్టాలతోనే గడిచిపోయింది : జగ్గారెడ్డి

తన జీవితమంతా కష్టాలతోనే గడిచిపోయిందని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తనకు అలా రాసిపెట్టి ఉందని చెప్పారు. ఎన్నికల్లో తన ఓటమి బాధను కాంగ్రెస్ గెలిచిందనే ఆనందంలో మర్చిపోయానని తెలిపారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనను పిలిచి రాహుల్ సభను పెడదామని అడిగారని తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న సమయంలో కేసీఆర్ సొంత జిల్లాలో లక్ష మందితో సభ పెట్టానని తెలిపారు. 

తన దూకుడును హరీశ్ రావు తట్టుకోలేక పోయారని జగ్గారెడ్డి అన్నారు. అందుకే తనను టార్గెట్ చేసి జైల్లో వేయించారని చెప్పారు. తాను ఏ బాధ్యతను నిర్వహిస్తానో ఆ బాధ్యత తనకు తప్పకుండా వస్తుందని కొంత టైమ్ పట్టినా రావాల్సిన బాధ్యత వస్తుందని చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఐదేళ్లుగా అడుగుతున్నానని చెప్పారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అందరం కలసి పని చేసి 14 లోక్ సభ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ పీఎం కావడానికి 14 ఎంపీలను ఇస్తామని చెప్పారు.