లింగంపేట మండలంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ సుడిగాలి పర్యటన

లింగంపేట మండలంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ సుడిగాలి పర్యటన

లింగంపేట, వెలుగు: లింగంపేట మండలంలోని 11 గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్​ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అయిదేండ్లలో  రూ.450 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు.  

గడిచిన 20 ఏండ్లలో జరగని, అభివృద్ధిని అయిదేండ్ల కాలంలోనే చేశానన్నారు. కేసీఆర్​ పాలనా పగ్గాలు చేపట్టాకే తెలంగాణ అబివృద్ధి చెందిందని, మూడోసారి ఆయన సీఎం అవుతారన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ గరీబున్నీసా, జడ్పీటీసీ ఏలేటి శ్రీలత,ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్​కమిటీ వైస్​చైర్మన్​ సిద్ధారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు దివిటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.