కార్తిక్ రత్నం, సుప్యర్ద సింగ్ జంటగా ఆనంద్ బడాని దర్శకత్వంలో యాదగిరి రాజు నిర్మించిన చిత్రం ‘లింగోచ్చా’. ఈనెల 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో కార్తిక్ రత్నం మాట్లాడుతూ ‘ఇందులో పక్కా హైదరాబాద్ కుర్రాడిలా కనిపిస్తా. ఒక వైవిధ్యమైన ప్రేమకథకు కామెడి జోడించడంతో పాటు అందరికీ నచ్చేలా క్యారెక్టర్స్ను డిజైన్ చేశారు.
కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు. క్యూట్గా కనిపించే తన క్యారెక్టర్కు అందరూ ఫిదా అవుతారని చెప్పింది సుప్యర్ద సింగ్. దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్ రొమాంటిక్ కామెడీతో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా తీశాం. హైదరాబాద్లో బిర్యాని, ఇరాని ఛాయ్ ఎలాగో, మా సినిమా కూడా అంతే ఫేమస్ అవుతుంది’ అన్నాడు. నిర్మాత యాదగిరి రాజు, చిత్ర సమర్పకురాలు జి. నీలిమ, ప్రొడక్షన్ డిజైనర్ అనిల్ కుమార్ తీగల తదితరులు పాల్గొన్నారు.