
ఉప్పల్, వెలుగు: లిక్కర్ లోడ్తో వెళ్తున్న డీసీఎం వాహనంలో మంటలు చెలరేగాయి. సమయానికి ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం హబ్సిగూడ నుంచి రామంతపూర్ కు లిక్కర్ లోడ్తో డీసీఎం వెళ్తోంది. హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8 సిగ్నల్ దగ్గర కరెంటు తీగలు తగలడంతో లోడ్పై ఉన్న కవర్కు మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేయడంతో భారీ నష్టం తప్పింది. లోడ్లో ఐదు కాటన్ల మద్యం బాటిళ్లు ధ్వంసమైనట్లు డ్రైవర్ తెలిపాడు.