రాత్రి 9 గంటల వరకు మద్యం షాపులు

రాత్రి 9 గంటల వరకు మద్యం షాపులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో లాక్ డౌన్ విధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ షాపులను మూసివేసింది. తర్వాత  లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల్లో భాగంగా మద్యం షాపులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాటికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మరో గంట అదనపు సమయం ఇస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇకపై ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లిక్కర్ షాపులను తెరుచుకోవచ్చని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో జారీ చేసింది.