
ఒక ఏడాదిన్నర పాటు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న పార్ట్నర్ ను కిరాతకంగా చంపేసి చెత్త ట్రక్కులో పడేశాడో దుండగుడు. చేతులు కాళ్లు కట్టేసి.. పెద్ద కవర్ బ్యాగ్ లో ప్యాక్ చేసి.. మున్సిపాలిటీ చెత్త ట్రక్కులో డంప్ చేశాడు. ఏం జరిగిందో తెలియనట్లు.. అసలు తనకు సంబంధమే లేనట్లు నటించిన ఆ దుర్మార్గుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూర్ మహానగర పాలక సంస్థ (BBMP) ఆదివారం (జూన్ 29) చెత్త ట్రక్కులో డంప్ అయ్యి ఉన్న ఒక బ్యాగ్ ను గుర్తించారు. గ్యార్బేజ్ ట్రక్కులో ఉన్న బ్యాగులో మహిళ మృత దేహం ఉండటంగమనించి పోలీసులకు సమాచారం అందించారు. చేతులు కాళ్లు కట్టేసి గాయాలతో చనిపోయి ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. చనిపోయింది ఆశ (40) అనే మహిళగా గుర్తించారు.
సీసీటీవీ, ఫోన్ వివరాల ఆధారంగా మహిళను చంపింది మొహమ్మద్ శంషుద్దీన్ (33) అనే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . అస్సాంకు చెందిన శంషుద్దీన్, ఆశ (40) అనే మహిళ దక్షణి బెంగళూరు హులిమావు లో అద్దె ఇంట్లో గత ఏడాదిన్నరపాటు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇద్దరికి అంతుకు ముందే పెళ్లై.. ఇద్దరిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో ఇరుగుపొరుగువారికి భార్యా భర్తల్లా పరిచయం చేసుకుని రిలేషన్ షిప్ కొనసాగిస్తూ వస్తున్నారు.
అయితే ఆశకు గతంలోనే భర్త చనిపోయాడని, అర్బన్ కంపెనీలో హౌజ్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శంషుద్దీన్ భార్య, ఇద్దరు పిల్లలు అస్సాంలోనే ఉంటున్నారు. అయితే ఏదో విషయంలో ఇద్దరి మధ్య చిన్న పాటి గొడవ రావడంతో ఆశను గొంతు బిగించి చంపేసినట్లు శంషుద్దీన్ పోలీసుల ఎదుట అంగీకరించాడు.
ఆశను చంపి బాడీని ప్యాక్ చేసి బైక్ పై తీసుకెళ్లిన నిందితుడు.. గ్యార్బేజ్ ట్రక్కులో పూడ్చిపెట్టాడు. ఇదంతా సీసీటీవీ లో రికార్డు అవ్వడంతో పోలీసులకు ఈజీగా దొరికిపోయాడు. లేటు వయసులో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆశ చనిపోయి ఇద్దరు పిల్లలను అనాధలను చేసింది. మరోవైపు హత్య కేసులో జైలుకెళ్లి భార్య పిల్లలను రోడ్డున పడేశాడు శంషుద్దీన్.