
చేవెళ్ల, వెలుగు: ఓ స్వీటు హౌస్లో పిల్లలు సమోసా తింటుండగా అందులో బల్లి దర్శనమిచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట గేటు దగ్గర ఉన్న మహాలక్ష్మి స్వీట్ షాప్లో జరిగింది. బుధవారం ఇద్దరు పిల్లలు రెండు సమోసాలు తీసుకున్నారు. మొదటి సమోసా తిన్నాక, రెండోది తినే క్రమంలో అందులో బల్లి కనిపించింది.
భయబ్రాంతులకు గురైన వారిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ దృశ్యం చూసిన ఆ షాపులోని ఓ అమ్మాయి వాంతులు చేసుకుంది. షాపు ఓనరు తాళం వేసి పరారైనట్లు స్థానికులు తెలిపారు.