ఒడిశాలో 30 వరకు లాక్ డౌన్

ఒడిశాలో 30 వరకు లాక్ డౌన్

భువనేశ్వర్‌‌‌‌: కరోనా వ్యాప్తి ని అరికట్టేందుకు ఒడిశా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. లాక్‌‌డౌన్‌‌ను ఈ నెల 30 వరకు కొనసాగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌‌ ప్రకటించారు. గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  తీసుకున్నామన్నారు. 30 వరకు రైళ్లు, విమాన సర్వీసులను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞ ప్తిచేశారు. జూన్‌ 17వరకు విద్యాసంస్థ ల కు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు  లాక్‌‌డౌన్‌‌ను ఇంకా పొడిగించాలని ఇప్పటికే చాలా రాష్ట్రాలు కేం ద్రాన్ని కోరాయి. దానిపై ఆలోచిస్తున్నామని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. కాగా.. లాక్‌‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయం తీసుకున్న  మొదటి రాష్ట్రంఒడిశానే. “ కరోనా వైరస్‌అనేది మానవజాతి ఎదుర్కొంటు న్నఅది పెద్దముప్పు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదనే విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల ను ధైర్యంగా, కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఆ జగన్నాథుని ఆశీర్వాదం, మన త్యాగం వల్ల ఇది దాటుకుని పోతాం” అని నవీన్‌ పట్నాయ క్‌‌ అన్నారు. జూన్‌ 17 వరకు ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టి ట్యూట్స్‌‌ను క్లోజ్ చేస్తున్నామని, ప్రజల ఆహార భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని చెప్పారు. వ్యవసాయ, పశుసంవరక్ధ, ఎమ్‌జీ ఎన్‌ఆర్‌‌‌‌ఈజీఎస్‌ సంబంధి త పనులు సోషల్‌ డిస్టెన్సింగ్  పాటిస్తూ చేసుకోవాలని చెప్పారు.