న్యూఢిల్లీ: టీఎంసీ నుంచి గెలిచి వేరే పార్టీలో చేరిన 20 మంది రెబెల్ ఎంపీలకు లోక్సభ సెక్రటేరియెట్ నోటీసులు జారీ చేసింది. 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. టీఎంసీ తరపున గెలిచిన 20 మంది ఎంపీలు త్రిపు రకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఈ నేపథ్యంలో రెబెల్ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని లోక్సభ సభ్యుల నిబంధనలు–1985లోని రూల్ 6 కింద జూన్ 18న అభిషేక్ బెనర్జీ పిటి షన్ దాఖలు చేశారు.
అన ర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని అభిషేక్ బెనర్జీ వేసిన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.
