జైలర్‌‌‌‌ 2 తర్వాత ఎన్టీఆర్‌‌‌‌తో..లోకేష్ కానగరాజ్ మూవీ..

జైలర్‌‌‌‌ 2 తర్వాత ఎన్టీఆర్‌‌‌‌తో..లోకేష్ కానగరాజ్ మూవీ..

రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్ 2’ సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.  ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌‌గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. లోకేష్ క నగరాజ్ డైరెక్షన్‌‌లో ‘కూలీ’ సినిమా షూట్ కంప్లీట్ చేసిన రజినీకాంత్.. ప్రస్తుతం ‘జైలర్ 2’ మూవీ షూటింగ్‌‌తో బిజీగా ఉన్నారు.  సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శనివారం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బర్త్‌‌ డే. షూటింగ్‌‌ లొకేషన్‌‌లో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్‌‌ వైరల్ అవుతున్నాయి. 

‘జైలర్‌‌‌‌’లో కనిపించిన లుక్‌‌లో రజినీకాంత్‌‌ కనిపించారు. కోలీవుడ్ స్టార్ కమెడియన్‌‌ యోగిబాబు కూడా షూట్‌‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. సోషల్ మీడియా ద్వారా నెల్సన్‌‌కు బర్త్‌‌ డే విషెస్ చెప్పారు. 

‘మనం చాలా కాలంగా మిస్ అయిన మన చిరునవ్వులు త్వరలోనే వెండితెరపైకి తిరిగి రాబోతున్నందుకు సంతోషంగా ఉంది.  మనకోసం ఓ రాకింగ్ ఇయర్‌‌‌‌ ఎదురుచూస్తోంది..’ అని నాగవంశీ రాసుకొచ్చారు.  దీంతో ఎన్టీఆర్‌‌‌‌తో నెల్సన్‌‌ తీయబోయే చిత్రం ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉండబోతోందంటూ అభిమానులు సంబరపడుతున్నారు.