తమిళనాడులో నేటితో ఎన్నికల ప్రచారం క్లోజ్..

తమిళనాడులో నేటితో ఎన్నికల ప్రచారం క్లోజ్..

చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. దీంతో అన్ని పార్టీలు ఇవాళ ఉదయం నుంచి జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఏప్రిల్- 18న తమిళనాడులో 39 పార్లమెంట్ స్థానాలతో పాటు, ఒక పుదుచ్చేరి స్థానానికి.. అలాగే ఖాళీగా ఉన్న 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సెంటర్లకు ఈవీఎంలు తరలించినట్లు తెలిపారు అధికారులు. పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తమిళనాడులో మొత్తం 5.8కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1.8 కోట్లమంది తెలుగు ప్రజలు ఉండగా..  1.4 కోట్ల మంది తెలుగు ఓటర్లు ఉన్నారు.