ఫాం హౌస్ కేసు : విచారణకు గైర్హాజరైన జగ్గుపై లుకౌట్ నోటీసులు

ఫాం హౌస్ కేసు : విచారణకు గైర్హాజరైన జగ్గుపై లుకౌట్ నోటీసులు

ఫాం హౌస్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై ఆరాతీస్తున్న అధికారులు ఆరోపణలు కేసుతో సంబంధం ఉన్న వారిని ప్రశ్నిస్తోంది. తాజాగా అడ్వొకేట్ శ్రీనివాస్, బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలను సోమవారం విచారణకు పిలవగా శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురు గైర్హాజరయ్యారు. దీంతో అధికారులు పరారీలో ఉన్న జగ్గు స్వామిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫాం హౌస్ కేసుకు సంబంధించి జగ్గు స్వామికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులోకి రాకపోవడంతో కేరళలోని ఓ ఆశ్రమ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. తాజాగా విచారణకు ఆయన గైర్హాజరుకావడంతో సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా సిట్ ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరినీ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న నలుగురిని విచారణకు పిలవగా అడ్వొకేట్ శ్రీనివాస్ ఒక్కరే హాజరయ్యారు. విచారణలో భాగంగా ఆయనను కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అధికారులు ఇవాళ కూడా సిట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.