హైదరాబాద్ లో వేలాడుతున్న యమపాశాలు

హైదరాబాద్ లో వేలాడుతున్న యమపాశాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో విద్యుత్​ శాఖ నిర్లక్ష్యానికి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాలు పడిన సమయాల్లో ఈదురుగాలులకు ఎక్కడి నుంచి ఏ వైరు తెగి మీద పడుతుందో తెలియడం లేదు. చాలా చోట్ల కరెంట్​లైన్లు లూజ్​అయినా పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల చెట్ల మధ్య నుంచే లైన్లు వెళ్తుండడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని భయపడాల్సి వస్తున్నది. 

గత ఏడాది రామాంతాపూర్​లో కిందకు వేలాడుతున్న కరెంట్​వైర్లను ఇనుప రథం తాకడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొంతకాలం వైర్లు తొలగించి హడావుడి చేసిన విద్యుత్​శాఖ యథావిధిగా సైలెన్స్​అయిపోయింది. ఇప్పుడు సిటీలో వైర్లు మునుపటి లాగే కనిపిస్తున్నాయి..అవి మీద పడి అమాయక జనాలు ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు.  

–  హైదరాబాద్ సిటీ, వెలుగు ఫొటోగ్రాఫర్స్