ఉత్తర ప్రదేశ్ ను యోగి సర్కార్ ఆగం చేసిందన్నారు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్. రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మాధురీ వర్మ సమాజ్వాదీ పార్టీ చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని, ఈ విషయం శ్రీ కృష్ణ భగవానుడు కలలోకి వచ్చి చెప్పాడని అన్నారు అఖిలేశ్. ఇది ఒక్క రోజు కాదని, ప్రతి రోజూ రాత్రి కృష్ణుడు కలలో కనిపించి చెబుతున్నాడని అన్నారు. రామ రాజ్య స్థాపన చేసే మార్గం సోషలిజమేనని, యూపీలో ఇది తమ పార్టీతోనే సాధ్యమని అఖిలేష్ అన్నారు.ఈ ఎన్నికల్లో గెలిస్తే 300 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో బీజేపీకి షాక్ తగిలినట్లయిందని చెప్పారు. ఈ హామీ అమలు కోసం తమ ప్రభుత్వం అనేక పవర్ ప్రాజెక్టులను కట్టనుందని ఆయన తెలిపారు.
#WATCH | "Lord Sri Krishna comes to my dream every night to tell me that our party is going to form the government,” said Former UP CM and Samajwadi Party chief Akhilesh Yadav yesterday pic.twitter.com/rmq1p8XgwT
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 4, 2022