సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు

సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం మలయప్పస్వామికి సింహవాహన సేవ కనుల పండుగగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో సింహవాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆ దేవదేవుని వైభవాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు.

ఇవాళ రాత్రి ముత్యపు పందిరి వాహనంపై స్వామి వారు విహరించనున్నారు.