సిద్దిపేట జిల్లా దుబ్బాక (మం) లచ్చపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున( జులై 12 వ తేదీన) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ ప్రేమ జంట.
దుబ్బాకకు చెందిన బాలిక , లచ్చాపేటలో పదో వార్డుకు చెందిన బాలుడు దుబ్బాకలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. భగీరథ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి ఆత్మహత్యతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నారు.