హోంగార్డ్ మిస్సీంగ్ కేసులో వీడిన మిస్టరీ : ప్రియుడి మోజులో పడి.. భర్తను హత్య చేసింది

హోంగార్డ్ మిస్సీంగ్ కేసులో వీడిన మిస్టరీ : ప్రియుడి మోజులో పడి.. భర్తను హత్య చేసింది

వరంగల్ రూరల్ జిల్లా: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఈ సంఘటన సోమవారం వరంగల్ రూరల్ జిల్లాలో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. నెక్కొండ మండలం, గేటుపల్లి గ్రామానికి చెందిన దుర్వత్ సింగ్ వరంగల్ లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అయితే కొన్ని రోజులుగా దుర్వత్ సింగ్ కనిపించకపోవడంతో.. అతడి బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు పోలీసులు. విచారణలో భాగంగా దుర్వత్ సింగ్ భార్యను ప్రశ్నించగా నిజం ఒప్పుకుందని తెలిపారు పోలీసులు.

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్త భూక్య దూర్యత్ సింగ్ ను భర్యనే హత మార్చిందని చెప్పారు. దీంతో హోంగార్డ్ మిస్సీంగ్ కేసులో మిస్టరీ వీడిందని తెలిపారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు భూక్య దూర్యత్ సింగ్ బంధువులు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.