ఆ మహిళను చంపింది ప్రేమికుడే

ఆ మహిళను చంపింది ప్రేమికుడే

దిశ ఘటన తర్వాత తీవ్ర సంచలనం సృష్టించిన చేవెళ్ల హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తేల్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి పైవంతెన కింద దారుణ హత్యకు గురైన మహిళ సిక్కిం రాష్ట్రానికి చెందినట్లు సైబరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెను హత్య చేసింది ప్రేమికుడేనని తెలిపారు. ఈ ఘటనకు నిందితుడి బంధువు సహకరించినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సిక్కిం రాష్ట్రానికి చెందిన మహిళకు …హైదరాబాద్ యువకుడితో పేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడినట్లు…అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వచ్చిన ఆమెను …ప్రియుడు అతడి బంధువుతో కలిసి హత్య చేసినట్లు నిర్ధారించారు. హత్యకు ముందు ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని…అదే హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని పారేసేందుకు ఓ ట్రావెల్స్ కు చెందిన కారును అద్దెకు తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తంగడపల్లి పైవంతెన కిందకు నైలాన్‌ తాడు సాయంతో మృతదేహాన్ని దించారు. తలను బండరాయితో మోదీ.. దుస్తులను అక్కడి నుంచి తీసుకెళ్లారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు బంగారు నగలను వదిలేసి వెళ్లినట్లు సమాచారం. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నట్లు తెలిపారు.

ఉలిక్కిపడ్డ గద్వాల్… రంగంలోకి దిగిన ఆఫీసర్లు

ఏడాది జీతాన్ని విరాళంగా ఇచ్చిన సీఎం

తబ్లిగి జమాత్ నిర్వాహకులపై FIR నమోదు