పెళ్లికి ఒప్పుకోలేదని విషం తాగి బస్సెక్కిన బావామరదలు

పెళ్లికి ఒప్పుకోలేదని విషం తాగి బస్సెక్కిన బావామరదలు

కామారెడ్డి జిల్లాలో ఇద్దరు బావామరదళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. గాంధారి మండలం పెద్దపోతంగల్ గ్రామానికి చెందిన సాయిరాం  కామారెడ్డి మండలం అడ్లూర్ కు చెందిన రమ్య ఇద్దరు బావామరదళ్లు. ఈ నెల 2 న బాన్సువాడ పరిధిలోని బోర్లం గ్రామానికి  చెందిన వ్యక్తితో రమ్యకు పెళ్లి కుదిరింది. ఇష్టంలేని వ్యక్తితో పెళ్లి చేస్తున్నందుకు తన బావ సాయిరాంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకుంది రమ్య. దీంతో ఇద్దరు బావామరదళ్లు విషం తాగా ఆర్టీసీ బస్సెక్కారు. విషం తాగి బస్సు ఎక్కిన బావమరదళ్లను సదాశివనగర్ మండల కేంద్రంలో బంధువులు పట్టుకున్నారు. చికిత్స కోసం బావ, మరదళ్లను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో  అక్కడి నుంచి సాయిరాం, రమ్యలను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.