హైదరాబాద్ : హోటల్ లో ప్రేమ జంట సూసైడ్ చేసుకున్న సంఘటన శనివారం హైదరాబాద్ లో జరిగింది. పంజాగుట్టలోని ఓ హోటల్లో పుదుచ్చేరికి చెందిన విజయకుమార్(34), శ్యామలదేవి (36) మే- 8 నుంచి గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేయలేదు. రూమ్ సర్వీస్ గురించి కూడా ఫోన్ చేయకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో హోటల్ కు చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా ..అప్పటికే ఇద్దరు మంచంపై విగతజీవులై పడి ఉన్నారు. ఘటనాస్థలంలో తమిళంలో రాసి ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో గతంలోనే ఇద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యలకు కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.