పాయిజన్ తాగి లవర్స్ సూసైడ్

పాయిజన్ తాగి లవర్స్ సూసైడ్

నల్గొండ: నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమను గెలిపించుకోలేక ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. అనుముల మండలం తెట్టేకుంట గ్రామానికి చెందిన మట్టపల్లి కొండలు (21), సంధ్య (19) ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోరనే భయంతో రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి సూసైడ్‎కు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిద్దరూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. యువతీయువకుడు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.