ఇంటర్ బోర్డు వైఫల్యాలపై హైకోర్టులో పిటిషన్

ఇంటర్ బోర్డు వైఫల్యాలపై హైకోర్టులో పిటిషన్

ఇంటర్ బోర్డ్  వైఫల్యాలపై  హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది బాలల హక్కుల సంఘం. దీనిని విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈ పిటిషన్ ఈ మధ్యాహ్నం  హైకోర్టు ముందుకు రానుంది. బాధ్యులపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. చనిపోయిన 16 మంది విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఫీజు లేకుండా పేపర్ రేవాల్యుయేషన్ చేయాలన్నారు పిటిషనర్. గ్లోబరిన్ టెక్నాలజీ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి సంస్థ పై తగు చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య  కార్యదర్శిలను ప్రతి వాదులుగా చేర్చారు పిటిషనర్.