తన అభివృద్ది కోసం.. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ మోసం చేసిండు: మధయాష్కీ గౌడ్

తన అభివృద్ది కోసం.. కన్నతల్లి లాంటి కాంగ్రెస్  మోసం చేసిండు: మధయాష్కీ గౌడ్

అభివృద్ది కోసం పార్టీ మారుతున్నానని చెప్పి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి.. తాను అభివృద్ది చెందాడు కానీ  ప్రజల సమస్యలను సుధీర్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం బీఎన్ రెడ్డి నగర్ లో.. 2023, నవంబర్ 11వ తేదీ శనివారం మధుయాష్కీ గౌడ్ పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కాలనీల వాసులను కోరారు.

ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోపాభూస్టిక జీఓలతో సుధీర్ రెడ్డి జనాలను మోసం చేస్తూ.. తాను ఆర్థికంగా అభివృద్ధి చెందాడు తప్ప ఓట్లు వేసిన జనానికి ఎం చేయలేదు ఆరోపించారు. మంత్రి కెటిఆర్ తో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.118జీఓ ఎక్కడ కూడా సమస్యను తీర్చలేదని అన్నారు.రాష్ట్రంలో కల్వకుంట్ల ప్యామిలీ, ఎల్బీనగర్ లో సుధీర్ రెడ్డి దోచుకుంటున్నారని అన్నారు.ఈ అవినీతి పాలన పోవాలంటే కాంగ్రెస్ కు ఓటేయ్యాలని మధయాష్కీ కోరారు.