పీసీసీ బీసీలకే ఇవ్వాలి..సోనియాగాంధీ తెలంగాణకు దేవత

పీసీసీ బీసీలకే ఇవ్వాలి..సోనియాగాంధీ తెలంగాణకు దేవత

పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా వ్యూహాత్మక నిర్ణయమన్నారు నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి . పీసీసీ చీఫ్ వాయిదాతో ఇబ్బందులు కూడా ఉన్నాయన్నారు. ఉత్తమ్ రాజీనామాకు చాలా కారణాలున్నాయన్నారు. సొంత నియోజకవర్గంలో ఓటమితో ఉత్తమ్ సంతృప్తిగా లేరన్నారు. కాంగ్రెస్ లో పీసీసీ పదవి కోరుకునే వాళ్లు ఎక్కవయ్యారన్నారు. కొందరు సొంత స్ట్రాటజీతో మాట్లాడుతున్నారన్నారు.

తెలంగాణకు సోనియా గాంధీ దేవత అని అన్నారు. రెడ్లకు పదవులిస్తేనే గెలుస్తామనే మాట్లాడారని.. కానీ చాలా మంది రెడ్డి నేతలు ఎన్నికల్లో ఓడిపోయారన్నారు.ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే పార్టీ బలపడదన్నారు. ఇపుడు పీసీసీ బీసీలకు ఇస్తే బాగుంటుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్నారు. అగ్రి చట్టాల విషయంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారన్నారు. మతం పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందన్నారు. కేసీఆర్ తో పొత్తు ప్రసక్తే లేదన్నారు.