
ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా రాజేష్ చికిలే దర్శకత్వంలో యం బంగార్రాజు నిర్మిస్తున్న చిత్రం ‘మధురం’. ‘ఎ మెమొరబుల్ లవ్’ అనేది టాగ్లైన్. టీనేజ్ లవ్స్టోరీగా రూపొందిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ టీజర్ను హీరో నితిన్ రిలీజ్ చేసి..టీజర్ ప్రామిసింగ్గా ఉందని, సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఉదయ్ రాజ్ మాట్లాడుతూ ‘ఇదొక క్లీన్ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. హీరోగా నాకు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నాడు. దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ ‘1990 నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తాం’ అన్నాడు. సినిమా షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాత చెప్పారు.