చామల కిరణ్​కుమార్​పై అసత్య ఆరోపణలు చేస్తే సహించం

చామల కిరణ్​కుమార్​పై అసత్య ఆరోపణలు చేస్తే సహించం
  •     పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి

ఎల్బీనగర్, వెలుగు : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్​అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి చెప్పారు. కొన్ని పార్టీల నాయకులు కక్షపూరితంగా కిరణ్​కుమార్​ను బద్నాం చేయాలని చూస్తున్నారన్నారు. ఆదిబట్ల పీఎస్​లో కిరణ్​కుమార్​పై కేసు నమోదుకావడంపై మధుసూధన్​రెడ్డి స్పందించారు. శనివారం ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడారు.

2003 సంవత్సరంలోనే కిరణ్ కుమార్ ప్లాట్ కొన్నారని తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ప్లాట్​నంబర్​కు కిరణ్​కుమార్​ప్లాట్​నంబర్​కు సంబంధం లేదని చెప్పారు. ఎన్నికల సందర్భంగా కిరణ్ కుమార్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్​నాయకులు కుమ్మకై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

విచారణలో అన్ని నిజాలు బయటికి వస్తాయన్నారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, నిరాదరణమైన ఆరోపణలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.