- పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి
ఎల్బీనగర్, వెలుగు : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి చెప్పారు. కొన్ని పార్టీల నాయకులు కక్షపూరితంగా కిరణ్కుమార్ను బద్నాం చేయాలని చూస్తున్నారన్నారు. ఆదిబట్ల పీఎస్లో కిరణ్కుమార్పై కేసు నమోదుకావడంపై మధుసూధన్రెడ్డి స్పందించారు. శనివారం ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడారు.
2003 సంవత్సరంలోనే కిరణ్ కుమార్ ప్లాట్ కొన్నారని తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ప్లాట్నంబర్కు కిరణ్కుమార్ప్లాట్నంబర్కు సంబంధం లేదని చెప్పారు. ఎన్నికల సందర్భంగా కిరణ్ కుమార్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్నాయకులు కుమ్మకై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
విచారణలో అన్ని నిజాలు బయటికి వస్తాయన్నారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, నిరాదరణమైన ఆరోపణలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.